Wednesday, September 2, 2020

samasya - samsleSaakshara praasa

 అందరూ చేపలబుట్టలో చేపలే చూస్తారు.. విప్రులు ఆ మీనాక్షీ అమ్మవారిని చూస్తారు..

కవిలులు మాత్రము వ్యాసభగవానుని తలుచుకుని వ్రాస్తారు గావున...అసాధారణ భావాలకోసం చూస్తూ వ్రాద్దామనుకుంటారు, అసాధారణమైనటువన్నీ చూస్తారు.. అవి చాలవు కొన్ని సందర్భాలలో..


అందరికీ తన్మాత్రలున్నట్టే కవికి ఒక extra వికటతన్మాత్ర ఉంటుంది.. అదిపోయినప్పుడు ఈ రొండిటినీ కలుపడమే దానికి మందు గా భావించి కలుపుతుంటారు😀😀


శా||

మత్స్యాధానమునందు జూడ గను సామాన్యంబుగన్ చేపలన్

మత్స్యాక్షిన్ గను విప్రవర్యులు దగన్ మత్స్యోదరీయస్పృహన్

మత్స్యోచ్ఛిష్టము జాలునే వికటతన్మాత్రావియోగంబునన్

మత్స్యక్షీరము బిల్లికొమ్ము గలుపన్ మందౌ కవీంద్రాళికిన్


ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

No comments:

Post a Comment